వెంకటాచలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.. ఎర్రగుంట సమీపంలో ముందు వెళుతున్న లారీ సడన్గా బ్రేక్ వేయడంతో.. వెనుక వస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ కిందకి కారు దూసుకెళ్లింది.. దీంతో కారులో ఉన్న నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన శనివారం రాత్రి 8 గంటల సమయంలో జరిగింది