నాచారం పోలీస్ స్టేషన్ పరిధి దుర్గ నగర్ లోని స్మశాన వాటిక సమీపంలో ఎండు గంజాయి అమ్మడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని ఎస్సై ప్రభాకర్ రెడ్డి, కానిస్టేబుల్ అదుపులోకి తీసుకున్నారు. ఎస్హెచ్ఓ ధనుంజయ నిందితుడిని విచారించారు. బీహార్ వాసి విశాల్ కుమార్ గా గుర్తించారు. అతని వద్ద 20050 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.