పెద్దపప్పూరు కు చెందిన నాగయ్య అనే అంధుడు గురువారం పెద్దపప్పూరు లోనే ఉన్నఫలంగా సొమ్మసిల్లి రోడ్డుపై పడిపోయాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అలాగే పడి ఉన్నాడు. ఎవరూ స్పందించలేదు. మానవత్వం మంట కలిసిపోయింది. అయితే చంద్రశేఖర్ అనే వ్యక్తి స్పందించాడు. వెంటనే ఎస్సై నాగేంద్రప్రసాద్ కు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నాగయ్యను కుటుంబ సభ్యులకు అప్పగించారు.