హైడ్రా బాధితులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. కూకట్పల్లిలోని అల్లాపూర్ సున్నం చెరువు వద్ద చిన్నారులకు ఎమ్మెల్యే కృష్ణారావుతో కలిసి ఆయన టపాసులు పంచిపెట్టారు. ఇందిరమ్మ ఇల్లు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూల్చుడు తప్ప ఎక్కడ కట్టడం లేదని విమర్శించారు. మరో రెండేళ్లకు బి ఆర్ ఎస్ ప్రభుత్వం వస్తుందని, ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు నిర్మించి ఇస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.