ప్రకాశం జిల్లా కొండపిలోని ప్రధాన రహదారుల్లో రోడ్డుపై వర్షపునీరు నిలబడి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయిబాబా గుడి సమీపంలో గోతుల్లో అడుగుకుపైగా నీళ్లు నిలిచాయి. ప్రభుత్వ కార్యాలయ భవనం వద్ద నీరునిలిచి ఉండడంతో అధికారులు, అర్జీదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల నేపథ్యంలో అనకర్లపూడి రోడ్డులో అట్లేరు చప్తాపై రక్షణ గోడలు లేకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.