అసిఫాబాద్: కొమురం భీం ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తివేత
ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి కొమురం భీం ప్రాజెక్టు లోకి 3,091క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆదివారం సాయంత్రం ప్రాజెక్టు అధికారులు 2 గేట్లను ఎత్తి 2,088 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237 మీటర్ల చేరుకుంది.