అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని ఉరవకొండ మండలం పాల్తూరు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో బొమ్మనహళ్ మండలంలోని గోవిందవాడ గ్రామానికి చెందిన వన్నూరు స్వామి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన తనని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.