నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొండపి ఎమ్మెల్యే డోలబాల వీరాంజనేయ స్వామి అధికారులతో అన్నారు. సోమవారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామి ప్రజల నుంచి వారి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని మంత్రి స్వామి తెలిపారు. అధికారులు కూడా ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.