ప్రకాశం జిల్లా పొదిలి లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రైల్వే ట్రాక్ ను రైల్వే ఇంజనీరింగ్ అధికారులు మరమ్మతులు చేపట్టారు. నడికుడి కాళహస్తి రైల్వే లైన్ ఇప్పటికే ఏర్పాటు చేసిన విషయం తెలిసినదే. దీంతో భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక రైలుతో పట్టాల మరమ్మతులను చేపట్టారు. త్వరలో ప్రయాణికులకు రైల్వే సదుపాయం అందుబాటులో రానున్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు.