యాడికి మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో మంగళవారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా యాడికి లోని చెన్నకేశవ స్వామి ఆలయంలో తెల్లవారి జామున నాలుగు గంటలకే ఉత్తరద్వారాన్ని తెరిచారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దేవాలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.