ప్రకాశం జిల్లా కొండపి సర్కిల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం స్థానిక సీఐ సోమశేఖర్ ఎస్ఐలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు దొంగతనాలు అరికట్టే అంశంలో వారికి సూచనలు సలహాలు ఇచ్చి పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా రాత్రి వేళలో దొంగతనాలు అరికట్టే అంశంలో గస్తీని పెంచాలన్నారు. ఇక రోడ్డు ప్రమాదాల నివారించేందుకు డ్రైవర్లకు కౌన్సిలింగ్, విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని సిఐ సోమశేఖర్ ఎస్ఐలకు తెలిపారు.