మేడ్చల్ నియోజకవర్గంలోని దమ్మైగూడ మున్సిపల్ పరిధిలోని కీసర గ్రామం లో నిర్మితమైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ పూజల్లో వజ్రేష్ యాదవ్ స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద కుటుంబాల గృహ కలను నిజం చేస్తూ ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తోంది. ఈ పథకం లక్షలాది కుటుంబాలకు ఆశ, ఆత్మవిశ్వాసం, భద్రత ఇచ్చిందని అన్నారు.