అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలం ఓబులాపురం వద్ద ఏపి కర్నాటక సరిహద్దు ప్రాంతంలో ఆరు ఇనుప గనుల లీజు సరిహద్దులను నిర్ధారించేందుకు అధికారులు గురువారం సాయంత్రం సర్వే ప్రారంభించారు. ఈ సర్వేను రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఛైర్మన్గా ఉన్న ప్రత్యేక కమిటీ పర్యవేక్షిస్తుందని మైన్స్ అండ్ జియాలజీ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ చౌదరి తెలిపారు, ఈ కమిటీ సెంట్రల్ సర్వే ఆఫ్ ల్యాండ్ అండ్ రికార్డ్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిందని అధికారులు తెలిపారు. కమిటీలో ఎంఒయుఎఫ్, సెంట్రల్ ఎంవిరాన్మెంట్ కంసర్వేషన్ (సి.ఈ.సి), మైన్స్ అండ్ జియాలజీ, అటవీ శాఖల అధికారులు సభ్యులుగా ఉన్నారని చెప్పారు,