మార్కాపురం జిల్లా కేంద్రంలో తొలిసారిగా నిర్వహించనున్న గణతంత్ర ఎస్ వి కె పి కళాశాల మైదానం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ రాజాబాబు జెసి శ్రీనివాసులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వివిధ శాఖల శకటాల ప్రదర్శన, సబ్ కలెక్టర్ బంగ్లాలో ఎట్ హోం కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. తొలి వేడుక కావడంతో ప్రజలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు.