అలంపూర్: బొంకూరు గ్రామంలో ఉపాధ్యాయుల కొరత... రోడ్డెక్కిన విద్యార్థులు
ఉండవెల్లి మండల పరిధిలోని బొంకూరు గ్రామంలో ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల యందు 240 మంది విద్యార్థులు ఉండగా 4 గురు ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు.