అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీలను సీఎం రేవంత్ రెడ్డి సర్వనాశనం చేస్తున్నారని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. 220 మందిని తీసేసి 16 మందిని చేశారని వాపోయారు. మాజీ సీఎం కేసీఆర్ అద్భుతంగా అందరికీ పరిపాలన బాగుండాలని చేశారని గుర్తు చేశారు. పద్ధతి, ఆలోచన లేకుండా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లను జిహెచ్ఎంసిలో విలీనం ఎలా చేస్తారు అని మల్లారెడ్డి ప్రశ్నించారు.