కళ్యాణదుర్గం మండలం కొత్తూరు పాఠశాలలో తరగతి గదుల కొరత కారణంగా విద్యార్థులు ఆరుబయట చదువుకోవలసి వస్తున్నది. ఈ విషయాన్ని హెచ్ఎం రవీంద్రనాథ్ తన మిత్రుడు బ్యాంకు ఉద్యోగి లోకేష్ కు తెలియజేశారు. లోకేష్ స్పందించారు. రూ. 40 వేలు వెచ్చించి పాఠశాలలో షెడ్డు ఏర్పాటు చేయించారు. ఈ క్రమంలో శుక్రవారం షెడ్డు నిర్మాణం పూర్తయింది. హెచ్ఎం రవీంద్రనాథ్,దాత లోకేష్ షెడ్డును ప్రారంభించారు. విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.