రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ వద్ద మెయిన్ పైప్ లైన్ వాల్వ్ శుక్రవారం ఉదయం విరిగిపోయి తాగునీరు వృధాగా పోతోంది. వెంటనే అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు కొత్త చెక్ నట్ వాల్వ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే నీటి ప్రవాహం వత్తిడి కారణంగా వాల్వ్ మార్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. నీరు పూర్తిగా వెళ్లిపోతే తప్ప పని చేసేందుకు వీలు పడటం లేదని సిబ్బంది తెలిపారు.