ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం కస్తూరిబా గాంధీ విద్యాలయం ఆవరణలో శుక్రవారం రెండు పెన పాములు పెన వేసుకుని ఆటలాడుతూ కనిపించాయి. అక్కడే ఉన్న సిబ్బంది పాములను కనిపెట్టి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకొని పాములను బంధించి స్థానిక అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అయితే కొద్దిసేపు ఆ ప్రాంతంలో భయానక వాతావరణం చోటుచేసుకుంది. పక్కనే పొలాలు ఉండడంతో పాములు విద్యాలయం ఆవరణలోకి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.