దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైసిపి దివ్యాంగులకు భాగం జిల్లా నేత ఆవుల నాగేంద్ర డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరు జాయింట్ కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో 21 రకాల వైకల్యాలు గల వ్యక్తులు పడుతున్న ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ని కోరారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున ప్రత్యేకమైన ఏర్పాట్లతో.. దివ్యాంగులకు అన్ని రకములైన ఉపకరణాలను మంజూరు చేయాలన్నారు..