రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు అధికారులు ఎక్కడికక్కడ నదీ ప్రవాహ ప్రాంతాల్లో భధ్రత చర్యలను చేపట్టారు. ఈ నేపథ్యంలో కలకడ మండలం బాలయ్యగారి పల్లి పంచాయతీలోని జరికోన నదీ ప్రవాహం వద్ద భధ్రత చర్యలను, పీలేరు మండలం పీలేరు పట్టణంలోని అయ్యపునాయిని చెరువు, అగ్రహారం చెరువు, నూనె వాండ్ల పల్లి వద్ద గల బహుదానది ని రాయచోటి అర్.డి.ఓ శ్రీనివాస్ పరిశీలించి, పలు జాగ్రత్త చర్యలు సూచించారు