ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు నవంబరు 1 నుంచి యథావిధిగా అందుబాటులోకి రానున్నట్లు డోన్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్, ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ శుక్రవారం తెలిపారు. స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా)కు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో అక్టోబర్ 10 నుంచి ఈ సేవలను నిలిపివేశామని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి సానుకూల హామీలు రావడంతో ఈ సేవలను పునఃప్రారంభించినట్లు వెల్లడించారు.