ఆత్మకూరు డివిజన్ పరిధిలోని శ్రీశైలం కాలినడక బాటలో అటవీ శాఖ సిబ్బంది తమ ఉదారతను చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఓ భక్తుడిని సకాలంలో ఆదుకుని ప్రాణదాతలుగా నిలిచారు. అనంతపురం జిల్లాకు చెందిన రమేష్ అనే భక్తుడు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం కాలినడకన బయలుదేరారు. అయితే, దట్టమైన అటవీ ప్రాంతంలోని భీమునికొలను సమీపానికి చేరుకోగానే రమేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నీరసంతో నడవలేని స్థితిలో అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో గస్తీ నిర్వహిస్తున్న అటవీ శాఖ బృందం రమేష్ను గమనించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా వారు స్పందించారు.