అనంతపురం నగరంలోని అరవిందనగర్ లోని సియస్ఐ హోళి ట్రినిటీ చర్చిలో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు (తేనేటి విందు మరియు క్రిస్మస్ వేడుకలు) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, సిఎస్ఐ చర్చ్ పాస్టర్ సుధాకర్ బాబు, ఆర్యకటిక వెల్హేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హరి కృష్ణారావు, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు కోనంకి గంగారామ్, రజక కార్పొరేషన్ డైరక్టర్ పరమేశ్వర్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, తదితరులు పాల్గొన్నారు.