ఆసిఫాబాద్ జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం ASF కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో ఎస్.పి. కాంతిలాల్ సుభాష్ పాటిల్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, అదనపు ఎస్.పి. చిత్తరంజన్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావులతో కలిసి రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రవాణా, ఆర్. టి. సి., వైద్య శాఖల అధికారులు, జాతీయ రహదారుల సంస్థ అధికారులతో రహదారి ప్రమాదాల నివారణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.