సికె పల్లి వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో వికలాంగుడికి గాయాలు
Anantapur Urban, Anantapur | Oct 19, 2025
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం సికె పల్లి వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో చిన్నంపేట గ్రామానికి చెందిన రాము అనే వికలాంగుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన రామును అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వారి కుటుంబ సభ్యులు 108 సహాయంతో తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.