ప్రకాశం జిల్లా దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మెడికల్ కళాశాల నిర్మాణాల గురించి క్లుప్తంగా వివరించారు. వైసిపి నాయకులు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారన్న దుష్ప్రచారాన్ని తిప్పి కొడుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. వైసిపి ప్రభుత్వం 25 సంవత్సరాలకు ప్రణాళిక చేస్తే మూడు సంవత్సరాలలో మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళిక చేసినట్లు పేర్కొన్నారు.