యాడికి మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో బైకును డ్రైవ్ చేస్తున్న శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డాడు. పెద్ద పేటకు చెందిన శ్రీనివాసులు పనిమీద యాడికి వెళ్ళాడు. తిరిగి పెద్దపేటకు వెళుతుండగా మార్గమధ్యలో ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.