అనంతపురం నగరంలోని భవాని నగర్ కు చెందిన గ్రీష్మంత్ అనే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి అదృశ్యమైనట్లు వన్ టౌన్ సిఐ వెల్లడించారు. ఈ సందర్భంగా అతను బుధవారం మధ్యాహ్నం భోజనానికి అని ఇంటికి వచ్చి అదృశ్యమైనట్లుగా ఆయన వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.