కనకదాస విగ్రహాన్ని వితరణ చేసిన మంత్రి సవిత
శ్రీ సత్య సాయి జిల్లా రొద్దం మండలంలోని కలిపి గ్రామంలో కురుబ కులస్థుల కోరికపై సంక్షేమ, జౌళి శాఖ మంత్రి సవిత కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాస విగ్రహాన్ని అందజేశారు. సోమవారం మధ్యాహ్నం కురుబ కులస్థులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అంజినప్ప, కూటమి నాయకులు, కురుబ సమాజ ప్రముఖులు పాల్గొన్నారు.