బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావం కారణంగా కడప జిల్లా పులివెందుల లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పులివెందుల మండలం ఎర్రబల్లె చెరువుకు వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాలైన అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని బట్రేపల్లె, బండమీద కొత్తపల్లి ప్రాంతాలలో వర్షాలు ఎక్కువగా కురుస్తుండడంతో వర్షపు నీరు నామాల గుండు మొట్నూతలపల్లె మీదుగా ఎర్రబల్లె చెరువుకు చేరుతోంది. ఎర్రబల్లె చెరువు నిండితే రెండేళ్లపాటు నీటి సమస్య ఉండదని ఆ ప్రాంత రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.