రెండు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న కరడుగట్టిన దొంగ నాగిరెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. 45 కేసుల్లో నిందితుడైన ఇతడు.. నవంబర్ 13న తెలంగాణ రాష్ట్రం కల్వకుర్తి కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. సీఐ జలంధర్ రెడ్డి బృందం సోమవారం రాత్రి హైదరాబాద్లో ఇతడిని పట్టుకుంది.నాగిరెడ్డి గతంలో 11 మంది పోలీసుల సస్పెన్షన్కు కారణమయ్యాడు. ఇతను నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం వీరాపూర్ వాసి. బుధవారం ఈ విషయం నంద్యాల జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది