జీవో నెంబర్ 22న వెంటనే ఉపసంహరించుకోవాలని డిఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. జిహెచ్ఎంసి కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. జీవో నెంబర్ 27 ద్వారా వేలంపాటతో ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టడానికి నిరసిస్తూ ప్రభుత్వ తీరును మీడియా ముఖంగా దుయ్యబడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి ఒకటే సింగిల్ అజెండాతో ఎక్కడైనా విలువైన భూములు ఉన్నాయో, వాటిని ఎలా కొల్లగొట్టుకోవాలో, ఏ విధంగా తన అనుచరులకు సోదరులకు కుటుంబ సభ్యులకు పంచి పెట్టాలో అనే సింగిల్ ఏజెండాతో పని చేస్తున్నారని అన్నారు.