డి.హిరేహాల్ మండలంలోని తమ్మేపల్లి గ్రామంలో ఊరిదేవర జరగనున్న నేపథ్యంలో రూరల్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో పుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం డి.హిరేహాల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి, సిబ్బందితో కలిసి గ్రామసభ నిర్వహించారు. దేవర సందర్భంగా గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కోరారు.