రాయదుర్గం పట్టణంలో 3 చోట్ల పబ్లిక్ టాయిలెట్ ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. స్థానిక MLA కాలవశ్రీనివాసులు చొరవతో స్వచ్ఛాంద్ర కార్పోరేషన్ నుండి రూ.41 లక్షలు మంజూరయ్యాయి. TDP నేతలు టంకశాల హనుమంతు, వెంకటేశులు, పురుషోత్తం తో కలిసి టౌన్ ప్లానింగ్ అధికారులు స్థలాలను పరిశీలించారు. శాంతినగర్ మార్కెట్, MPDO కాంప్లెక్స్, బళ్ళారి రోడ్డు వన్నూరస్వామి కట్ట దగ్గరలో వీటిని ఏర్పాటు చేస్తామని కమీషనర్ తెలిపారు.