నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి సుమారు వందమంది గర్భిణీలకు పౌష్టికాహారాన్ని శుక్రవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌచ్ కాహారం లోపం కారణంగా గర్భిణీ స్త్రీలు రక్తహీనత వంటి సమస్యలకు గురై ప్రసవ సమయంలో అనేక సంక్లిష్టతలను ఎదుర్కొన్న నేపథ్యంలో తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తున్నట్లు అని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు సరైన పోషకాహారం పై అవగాహన కల్పించడం వారికి అవసరమైన పోషకాలు అందించడం ద్వారానే ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించవచ్చని పేర్కొన్నారు