తాడిపత్రి పట్టణంలోని పెద్దమ్మ ఆలయంలో ఉన్న త్రిశూలాన్ని మంగళవారం మందుబాబులు పెరికేసి పక్కన పడేశారు. మందుబాబులకు త్రిశూలం అడ్డంగా ఉందనే సాకుతో తొలగించారు. ఈ విషయంపై ఆలయ కమిటీ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పెరికేసిన త్రిశూలాన్ని పరిశీలించారు. త్రిశూలాన్ని పెరిగేసిన మందుబాబుల కోసం ఆరా తీశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.