ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని కొత్తపాలెం సమీపంలో టిటిడి కళ్యాణ మండపం పనులు ముమ్మరంగా చేపట్టారని టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. జనవరి ఫిబ్రవరి నెలలో కళ్యాణ మండపం పూర్తవుతుందన్నారు. దీంతో పేదలు కళ్యాణం జరుపుకునేందుకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.