ప్రకాశం జిల్లా కంభం మండలంలోని రావిపాడు గ్రామంలో మెంథా తుఫాన్ సమయంలో ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల పైకప్పు కుప్పకూలింది. ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, టి.శ్రీనివాసులు, కాంప్లెక్స్ చైర్మన్ గని.వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు మట్టి మిద్దెగా ఉన్న స్కూల్ భవనం కూలిందనీ, ముందస్తు హెచ్చరికలు చేస్తూ, పాఠశాలలకు సెలవు ప్రకటించినందున ఎవరికి ఎటువంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా అద్దె భవనంలో పాఠశాలను కొనసాగిస్తామన్నారు. ఉదృతంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ వాగును పరిశీలించి విద్యార్థులు అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.