నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని వాంకిడి సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం రాత్రి వాంకిడి మండలం ఖమన గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 32 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ మాట్లాడుతూ.. ప్రజల రక్షణే పోలీసుల బాధ్యత అని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాంకిడి ఎస్ఐ మహేందర్ ఉన్నారు.