ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు చవటపాలెం గ్రామ పొలాలలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని లారీ తగలబడింది. వరి కోత మిషన్ పొలంలో దింపి పక్కన పార్కింగ్ చేసే సమయంలో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. దీంతో మంటలు ఎగిసిపడ్డాయని ఫైర్ స్టేషన్ సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అన్నారు. అప్పటికే లారీ పూర్తిగా తగలబడిందన్నారు.