పీఎం జన్మన్ ఇందిరమ్మ ఇళ్లు మంజూరులో మా గ్రామాల పేర్లు లేవని ఆదివాసీ గ్రామాల ప్రజలు తమ అవేదన వ్యక్తం చేశారు. జైనూర్ మండలం మాణిక్ గూడ, గౌరీ కోలాంగూడలో నివాసం ఉంటున్న వారి పేర్లు పీఎం జన్మన్ పథకంలో రాలేదన్నారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామని గ్రామస్థులు తెలిపారు. అన్ని గ్రామాల్లో పీఎం జన్మన్ పథకం ప్రారంభమై పనులు జరుగుతున్నాయని తెలిపారు. మా గ్రామాల్లో కూడా పనులు ప్రారంభించాలని కలెక్టర్ ను వేడుకున్నారు.