శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం మండలం కొత్తకోట లో బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో మద్యం మత్తులో రమేష్ అనే వ్యక్తి పై ఇంటి దగ్గర కూర్చొని ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు కట్టెలతో దాడి చేసి పరారయ్యారు. రమేష్ కు తీవ్ర గాయాలవ్వడంతో హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.