కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ లోని జగద్గిరి నగరంలో ద్రోణాచారి స్వామి వారి నివాసంలో ఆదివారం నిర్వహించిన అయ్యప్ప స్వామి పూజలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తుల క్షేమం కోసం ప్రార్థనలు చేశారు. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో అందరికీ ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలు కలగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.