ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజా వినతులను ఎంపీ స్వయంగా అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.