ఉప్పల్, నారపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వద్ద భారీ ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి నుంచి నగరానికి వస్తున్న ఆర్టీసీ బస్సు ఫ్లై ఓవర్ పిల్లర్ నెంబర్ 102 ను ఢీకొట్టబోగా అప్రమత్తమైన డ్రైవరు వెంటనే బస్సును అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఒకసారిగా కుదుపునకు లోనయ్యారు. ప్రమాదం తప్పడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.