ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్ గఫార్ ప్రారంభించారు. ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. తల్లితండ్రులు తమ ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్న చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించి వారికి పోలియో రాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు.