నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ని పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద AVOPA ఆధ్వర్యంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 74వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఆవోపా సంఘ సభ్యులు నివాళులర్పించారు, ఈ సందర్భంగా ఆవోపా సంఘ అధ్యక్షులు వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను గుర్తు చేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఆయన వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు, ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు