జిల్లా ఎస్పీ జగదీష్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో గ్రామసభలు నిర్వహిస్తూ ప్రజలకు, ముఖ్యంగా యువతకు వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు.ఈ గ్రామసభలలో అసాంఘిక కార్యకలాపాలు, గొడవలు, హింసాత్మక చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. యువత చెడు అలవాట్లకు లోనవకుండా మంచి మార్గంలో సాగేందుకు విద్య, ఉపాధి, క్రీడల వైపు దృష్టి సారించాలని మార్గనిర్దేశం చేశారు.అలాగే రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా అనేక విలువైన ప్రాణాలను కాపాడవచ్చని వివరించారు.