గిద్దలూరు పట్టణంలో కోటి రూపాయలకు పైగా వచ్చించి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పట్టణంలోని రాచర్ల రోడ్డులో డ్రైనేజీ పనులు మరియు ఇతర అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులతో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.